Breaking News

కేసారం గ్రామంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారీ విజయం

రేఖ రమణ సతీష్ గౌడ్

మన ప్రగతి న్యూస్ /సూర్యాపేట జిల్లా స్టాపర్

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థి రేఖ రమణ సతీష్ గౌడ్ గెలుపొందడం జరిగింది. 186 ఓట్ల మెజార్టీతో బిజెపి పై సతీష్ గౌడ్ గెలుపొందడం వల్ల గ్రామంలో పార్టీ నాయకులు ప్రజలు ఆనందోత్సవంతో సంతోషంతో విజయోత్సవ పండుగ జరుపుకుంటున్నమని తెలియజేశారు. సతీష్ గౌడ్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అని చాలా సంతోషంతో తెలియజేశారు. ఈ గెలుపు నాకు కాంగ్రెస్ బిఆర్ఎస్ గ్రామ ప్రజలు ఇచ్చిన గొప్ప వరం లాంటిదని రేఖ సతీష్ తెలియజేశారు. గ్రామంలో ప్రతి సమస్యను దగ్గరుండి తీరుస్తానని సతీష్ తెలియజేశారు. ఈ గెలుపు పార్టీ నాయకులు కష్టపడిన ఫలితమే అని ఆయన తెలియజేశారు. ఈ గెలుపు ఆనందోస్తవ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేశారు.