మనప్రగతి న్యూస్/ వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ నోటు కలకలం రేపింది. మహిళా స్వశక్తి సంఘం సభ్యురాలి వద్ద రూ.500రూ” దొంగ నోటు లభించింది. గ్రూపు లీడర్ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లిస్తుండగా, సిబ్బంది ‘ఐదువందల’ రూపాయల దొంగ నోటును గుర్తించారు. సభ్యుల వద్ద సేకరించిన మొత్తంలోనే ఇది రావడం, ఈ ప్రాంతంలో దొంగ నోటు బయటపడటం ఇది రెండవ, సారి కావడంతో, నోటు ఎవరి వద్ద నుంచి వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

