Breaking News

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి-ఎస్సై సాయి కిషోర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

దమ్మపేట మండలంలో ఆదివారం రెండో విడత ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా దమ్మపేట పోలీస్ ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని తెలిపారు. ఈ యొక్క ఎలక్షన్ 31 పంచాయతీలకు గాను 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ప్రజలందరూ సహకరించాలని, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలియజేశారు. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరు100 మీటర్ల లైన్ లోపల ఎటువంటి వాహనాలు నిలప రాదని, ముగ్గురు లేక నలుగురు గుమ్మిగుడి ఉండరాదని, పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల లోపల గాని, బయట గాని ఎటువంటి టెంట్లు వేయడం కానీ కుర్చీలు వేయడం గాని మీటింగులు పెట్టడం కానీ చేయకూడదని తెలిపారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..