నిజాయితీగా ప్రజల సేవ చేస్తా
ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందిస్తా
మీ సేవే నా లక్ష్యం
బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన బాంజీపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మాట్ల రాజు
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట మండలంలోని బాంజీపేట గ్రామానికి బిఆర్ఎస్ మాజి శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాట్ల రాజు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సమస్యలను నీతి నిజాయితీగా గ్రామసభ ఏర్పాటు ద్వారా పరిష్కరిస్తానని అన్నారు. గ్రామంలోని సిసి రోడ్లు, డ్రైనేజీలు,అందరికీ రక్షితమైన తాగునీరు అందిస్తానని వీధిలైట్లు ఏర్పాటుకు చొరవ తీసుకుంటానని, యువత కోసం క్రీడా లైబ్రరీ సదుపాయం ఏర్పాటు చేస్తానన్నారు. నీతి నిజాయితీగా పనిచేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తానని నర్సంపేట మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. బాంజిపేట ప్రజలు నన్ను ఆదరించి బ్యాట్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.


