Breaking News

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వం, ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వాసం ఫలితాల్లో స్పష్టంగా ప్రతిఫలించింది.
ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్, గాంధారి మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 95 శాతం స్థానాలను కైవసం చేసుకుంది.ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు, స్థానిక నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి..ఈ విజయంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడగా, రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..