Breaking News

గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తా

అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతా

కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించండి కాంగ్రెస్ బలపరిచిన రాజుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి మూడు శాంతి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

మండలంలోని రాజుపేట గ్రామానికి కాంగ్రెస్ బలపరిచిన గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో మూడు శాంతి బరిలో నిలిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శాంతి మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని గత పాలకులు ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసారని అన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజ్,గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ చాలా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే గ్రామాల్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని, నీతి నిజాయితీగా పనిచేసే గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.