Breaking News

ఘన విజయం సాధించిన పగడాల రమాదేవి

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మేజర్ పంచాయతీ కి రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల రాంబాబు సతీమణి పగడాల రమాదేవి 471 ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించి సర్పంచి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, నీతివంతమైన పాలన, సమర్థవంతమైన పాలన అందిస్తానని ఆమె అన్నారు. నన్ను గెలిపించిన ప్రజలందరికీ, నా గెలుపు కోసం నిర్విరామంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..