మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మేజర్ పంచాయతీ కి రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల రాంబాబు సతీమణి పగడాల రమాదేవి 471 ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించి సర్పంచి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, నీతివంతమైన పాలన, సమర్థవంతమైన పాలన అందిస్తానని ఆమె అన్నారు. నన్ను గెలిపించిన ప్రజలందరికీ, నా గెలుపు కోసం నిర్విరామంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

