Breaking News

ముస్తాబాద్ లో మూడో విడత పోలింగ్ పటిష్ట బందోస్తు

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు సందర్భంగా స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ పలు సూచనలు చేశారు, స్థానిక ఎన్నికలు 17 తేదీ న ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరగనున్న సందర్భంగా, ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయబడింది.163 BNSS (144 సెక్షన్) అమల్లో ఉండటంతో ఐదుగురికి మించి గుంపులుగా గుమికూడరాదు. తెలిపారు,15 తేదీన సా.5.00 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ప్రచారం, సభలు, ర్యాలీలు, లౌడ్‌స్పీకర్లు నిషేధం.పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం, అడ్డంకులు ఉండరాదు.200 మీటర్ల పరిధిలో బూత్‌లు అనుమతి లేదు. అనుమతితో ఒక్క బూత్ మాత్రమే ఏర్పాటు చేయాలి. పోలింగ్ స్టేషన్‌లో లేదా 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం,మద్యం దుకాణాలు 15 తేదీన సా.5.00 నుండి 18 తేదీన ఉ.10.00 వరకు మూసివేయబడ తాయి. తెలిపారు,పోలింగ్ కేంద్రంలోకి గుర్తింపు కార్డు మాత్రమే అనుమతి. ఇతర వస్తువులు నిషేధం,పోలింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిషేధంఎన్నికలు శాంతియుతంగా జరగేందుకు ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని తెలిపారు,

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..