ఎస్సై సాయి కిషోర్ రెడ్డి
మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న కోర్టు నందు డిసెంబర్ 21వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్ నందు డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టికేసులు, యాక్సిడెంట్, చీటింగ్ కేసులు, కాంపౌండ్ కేసులు పరిష్కరించబడతాయని ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.

