మనప్రగతి న్యూస్/జహీరాబాద్
జహీరాబాద్ టౌన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం సాయంత్రం పస్తపూర్ గ్రామ శివారులోనిఆర్ ఎల్ ఆర్ స్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మద్యం సేవిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జహీరాబాద్ టౌన్ ఎస్సై కె. వినయ్ కుమార్ హెచ్చరించారు.

