- ఏవో పోరిక జైసింగ్
మన ప్రగతి న్యూస్/నడికూడ:
రైతులు యూరియా బుకింగ్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని నడి కూడ ఏవో పోరిక జైసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే యాసంగి సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యూరియాను సరఫరా చేసేందుకు ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. శనివారం నుంచి యాప్ సేవలు అందుబాటులో ఉంటాయ న్నారు. రైతులు తమ మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలని సూచిం చారు. జిల్లా, సొసైటీల ఎంపిక ఆనంతరం యూరియా బస్తాల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. పంట సీజన్, పాస్ బుక్ నంబర్, పంట విస్తీర్ణం, పంట రకం వివ రాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. పాసులు లేని రైతులు ఆధార్ ద్వారా యూరియా బస్త్రాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.

