మన ప్రగతి న్యూస్ /వీణవంక:
వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రామచంద్ర (14) విద్యార్థి మృతి.ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రామచంద్ర కులం కేరళ పాఠశాలలో పదవ తరగతి అభ్యాసం చేస్తున్నాడు. చదువుపై విరక్తి చెంది అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్ళేది.ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చదువుపై శ్రద్ధ పెట్టాలని మందలించే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 19 ఉదయం రామచంద్రను అతని అన్న పూర్ణచంద్ర వీణవంకలోని కేరళ స్కూల్లో డ్రాప్ చేసి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడికి వాంతులు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వారు అక్కడికి చేరుకుని రామచంద్రను జమ్మికుంట లోని దీక్షిత హాస్పిటల్కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఆర్.జి. హాస్పిటల్లో అడ్మిట్ చేసి, అక్కడి నుంచి యశోద హాస్పిటల్, హైదరాబాద్కు తరలించారు అనంతరం డిశ్చార్జ్ అయిన రామచంద్ర, కొద్ది రోజుల తర్వాత మళ్లీ అస్వస్థతకు గురవడంతో తిరిగి కరీంనగర్ లోని ఆర్.జి. హాస్పిటల్లో చేర్పించారు.చికిత్స పొందుతూ ఈ నెల19 తెల్లవారుజామున 3 గంటలకు రామచంద్ర మృతి చెందినట్లు మృతుని తండ్రి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి అన్నారు.

