శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవాయి రవి…
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
ఖమ్మం జిల్లా డిసెంబర్11న జరిగిన తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మనసును గెలుచుకున్న వారే నిజమైన నాయకులని శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత ఉత్సవాయి రవి పేర్కొన్నారు. పందిళ్ళపల్లి సర్పంచ్ గా వత్సవాయి పద్మ జానకిరాములు గెలుపొందిన విషయం తెలిసినదే.ఈ సందర్బంగా వత్సవాయి రవి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పందిళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలవడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేయాలని తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి దిశాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు వత్సవాయి జానకిరాములు,పందిళ్ళపల్లి సిపిఎం శాఖ కార్యదర్శి లింగం కోటేశ్వరరావు, నాయకులు కొల్లి నారాయణ,బండ్ల రామయ్య, అలవాల అంజయ్య, ఏసు వెంకటేశ్వర్లు, మండే రవి, ఏసు బాబు, అలవాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవాయిరవి నీ పందులపల్లి నూతన సర్పంచిగా ఎన్నికైన దంపతులు ఘనంగా సన్మానించినారు.


