Breaking News

పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదు

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్

మన ప్రగతి న్యూస/ ఖమ్మం జిల్లా స్టాపర్:

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిపై సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత, డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉచిత వైద్య ప్రదాత, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సత్తుపల్లిలో పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అండతో గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పార్టీ పట్ల విధేయత లేకుండా క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ఎవరిస్తే ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయాలు చేసుకోవాలంటే పార్టీ నుంచి వెళ్ళిపోయి మీకు నచ్చిన పార్టీలో ఉండి రాజకీయాలు చేసుకోవాలని ఒకే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పట్ల నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు,