మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ జిల్లా టిడిపి కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దానికి పాల్పడ్డారని టిడిపి నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసిపి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మ దినం సందర్భంగా ర్యాలీగా వెళుతున్న కార్యకర్తలు టిడిపి కార్యాలయంలోకి చొరబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను దుర్భసలతో దూషిస్తూ… వీరంగం సృష్టించారని నేతలు తెలియజేసినారు. వైసీపీ కార్యకర్తలను అడ్డుకోబోయిన జిల్లా టిడిపి ఆఫీస్ వాచ్మెన్ పై భౌతిక దాడికి దిగారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని , ఖమ్మం నగర ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా నిర్వహించినారు.


