మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం పలు గ్రామాలలో పంచాయతీ భవనాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 22న సోమవారం నాడు నూతన పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలకు రంగులు వేసి, నూతన ఫర్నిచర్తో సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను భవనాల గోడలపై రాస్తున్నారు, మూడు విడతల్లో ఎన్నికై న సర్పంచ్లు, వార్డు సభ్యులంతా ఒకే రోజు 22వ తేదీన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపటి నుంచి ఐదేళ్ల కాలపరిమితతో నూతన పాలకవర్గాలు కొనసాగనున్నాయి…

