అతివేగం, డ్రంకెన్ డ్రైవ్ వల్లే మృతిచెందారు’
మన ప్రగతి న్యూస్/ వేములవాడ:
వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ రాజు తెలిపారు. పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్, నంది కమాన్ ప్రాంతాల్లో ఈరోజు తనిఖీలు చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్లో పలుమార్లు పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇటీవల చాలామంది అతివేగం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్లే మృతి చెందారన్నారు.

