మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
మన ప్రగతి న్యూస్ /కడ్తాల్ :
విద్య ప్రజా సేవకు దిక్సూచి లాంటిదని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. బుధవారం కడ్తాల్ మాజీ సర్పంచ్ ఎల్.ఎన్ రెడ్డి జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ సాధించిన సందర్భంగా ఆయనను మాజీ ఎమ్మెల్యే, నాయకులు సన్మానించి అభినందించారు. ప్రజాసేవతో పాటు విద్యను సమన్వయం చేస్తూ ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. సమాజంలో మార్పు, అవగాహనతో కూడిన విద్య అవసరమని యువత ఆ దిశలో పయనించాలన్నారు.

