Breaking News

చెరువును తలపిస్తూ ఇంటి చుట్టూ నీరు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం కేశవపట్నం ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తూ పలువురు ఇండ్ల చుట్టూ చేరి చెరువును తలపిస్తుంది.రహదారి వెంబడి నీరు ప్రవహించడంతో అధికార కార్యాలయాలకు,కరీంపేట,కేశవపట్నం, పాపయ్యపల్లి గ్రామాల ప్రజలకు,వాహనదారులకు ఈ దారే ప్రధాన రహదారి కావడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సమీప ప్రజలు కోరుతున్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు