మన ప్రగతి న్యూస్/ములకలపల్లి:
మన ప్రగతి దినపత్రిక క్యాలెండర్ ను పాల్వంచ డిఎస్పీ.. వారి కార్యా లయంలో డీఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ..ప్రజ సమస్యలను వెలికి తీసి అధికారుల దృష్టికి అందించడంలో మన ప్రగతి దినపత్రిక కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజా సమస్యల పక్షాన మన ప్రగతి దినపత్రిక ఎల్లప్పుడు కృషి చేస్తున్న దని.. పత్రికలు అధికారులకు ప్రజలకు వారధిలా పనిచేయాలని కోరారు. ప్రజల పక్షాన ప్రజా సమ స్యలపై ప్రజల గొంతుకగా మన ప్రగతి దినపత్రిక ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం పాత్ర కీలకమని తెలిపారు. ఈ ఆవిష్కరణలో మన ప్రగతి రిపోర్టర్ గంట వెంకటేశ్వర్లు ఉన్నారు.

