Breaking News

మున్సిపల్ ఎన్నికల దృశ్య జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు:జిల్లా ఎస్పీ

మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో మున్సిపల్ ఎన్నికల దృశ్య శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861ప్రకారం నెల రోజుల ఫిబ్రవరి 1వ తేది నుండి 28 వరకు పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు నిరసనలు,ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు సభలు సమావేశాలు నిర్వహించరదాని, తెలిపారు, నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు…

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..