-భవితవ్యం పై పార్టీలకు కునుకే కరువు
ఎవరి వ్యూహం వారిదే.,-ఎవరి ధీమా వారిదే.
-ఎన్ హెచ్ ఆర్ సి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు.
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:
మున్సిపల్,కార్పోరేషన్ గడ్డపై సాగుతున్న,రాజకీయ భూకంపం,ఓటు ఎవరికి పట్టం కడుతుందో,ఎవరికి గండం తెస్తుందో.?,ఓటరు దేవుడా,నీ మనసెటు?నాయకుల నోట పేలుతున్న మాటల తూటాలు, మున్సిపల్ కార్పొరేషన్ వీధుల్లో రాజకీయ జాతరలు.ఆశల గుర్రాలు పందెంలో,రిగెడుతున్నాయి.గెలుపు జెండా కోసం తహతహలాడుతున్నవివిధ పార్టీలు.,మురిపించేవారెవరినో ముంచేదెవరినో..?
ఓటరే దేవుడు,ఇక వారి తీర్పే శిరోధార్యం, మారనున్న రాజకీయ భవితవ్యం రాజకీయ చదరంగంలో గెలుపెవరిదో,మలుపెవరిదో…
అధికార పీఠం ఒకటే,ఆశావహులు ఎందరో.?పలు మున్సిపాలిటీలో ముదిరిన పోరు.ఎవరి పట్టు వారిదే.ప్రజా క్షేత్రంలో తేలనుంది అసలు సిసలు దమ్ము.ఓటరు వేయనున్నాడు గెలుపు ముద్ర. మున్సిపాలిటీ యుద్ధంలో వార్డులే లక్ష్యం, గెలుపు గుర్రాలపైనే నేతల గురి.,పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోరు..తెలంగాణ గడ్డపై మొదలైంది అసలు సిసలు హోరు.వార్డు వార్డులో వ్యూహాల వేడి, మున్సిపల్ పీఠంపై ఎవరిది జోడి?ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడి కనిపిస్తోంది.ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా రాజకీయ ప్రకంపనలే కనిపిస్తున్నాయి.పలు పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో అత్యంత ఆసక్తికరంగా మారింది.వ్యూహ ప్రతివ్యూహాల నడుమ తెలంగాణ రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం ఇద్దరు నేతలు గెలుపు గుర్రాలై నిలుస్తున్నారు.ఒకరు ప్రజాబలంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ప్రస్తుత శాసనసభ్యులు ఇంకొకరు అదృష్టం కలిసిరాక ఓడిన మాజీలు తమ నియోజకవర్గంపై తనదైన ముద్ర వేయాలని చూస్తున్న తాజా మాజీల ఆశయం ఒక్కటే.. పీఠంపై తమ జెండాలు ఎగురవేయడం. కానీ, ఆ గెలుపు బాట అంత సులభంగా కనిపించడం లేదు.మున్సిపాలిటీ ఓటరే ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’నియోజకవర్గ గెలుపోటములను శాసించేది ప్రధానంగా రాష్ట్రం లోని మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లే.ఇక్కడి ఓటరు దేవుళ్ళు ఎటు మొగ్గు చూపుతారన్నదే ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న ఉత్కంఠ. ప్రస్తుత ఎమ్మెల్యేలు తన అభివృద్ధి పనులతో ఓటర్లను మెప్పిస్తామనే ధీమాతో ఉన్నారు.మరోవైపు,మాజీ ఎమ్మెల్యేలు కేడర్ను బలోపేతం చేస్తూ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
మురిపిస్తారా.? ముంచేస్తారా.?ఓటరు చేతులో పని రాజకీయ స్టంట్లు,ఆరోపణలు, విమర్శల పర్వం ఎలా ఉన్నా,అంతిమ నిర్ణయం ఓటరు దేవుళ్ళదే. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ప్రజలు ఒకరికి జై కొట్టి మురిపిస్తారా.?లేదా తమ ఓటు అనే ఆయుధంతో మరొకరి ఆశలను ఆవిరి చేస్తారా.?అనేది వేచి చూడాలి.ప్రస్తుతానికి మాత్రం రాష్ట్ర రాజకీయం జైలు గోడ మీద పిల్లిలా ఉందనే చెప్పాలి.ఎవరు గెలిచినా, ఓడినా ఈ ఓట్ల యుద్ధం మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.ఏక్ దిన్ కా సుల్తాన్ ఓటరు మనసెటో మరీ.

