మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి:
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అం దించాలని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజ నాన్ని ఆయన పరిశీలించారు. అనంత రం విద్యార్థులతో కలిసి సర్పంచ్ వెంక టేష్ మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలన్నారు. భోజనం పై విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట ఉప సర్పంచ్ గోనె ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, పాఠశాల సిబ్బంది, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులున్నారు.

