Breaking News

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమ్మడి నరసయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలుగ చెయ్యకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించే లాగా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐలు సాయిబాబా, రాజు, జఫర్గడ్ ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

11 వ వార్డులో బీజేపీ గెలుపు ఖాయం

బీజేపీ అభ్యర్థి మహేశ్వరి రాజారామ్

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

రైతాంగానికి అండగా నిలిచిన కేసీఆర్ పాలనకు మద్దతు అవసరం

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని 11వ వార్డు లో బీజేపీ గెలుపు ఖాయం అని బిజెపి బలపరిచిన అభ్యర్థి మహేశ్వరి రాజారామ్ తెలిపారు. ఆదివారం 11 వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని దేశం గర్వించదగ్గ నాయకునికి బహుమతిగా ఈ వార్డును ఇవ్వాలని ఓటర్లను కోరారు. బీజేపీ వల్లే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రచారంలో భాగంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.