Breaking News

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

.మునిపంపుల ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం

మన ప్రగతి న్యూస్/ రామన్నపేట:

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అర్ఫాత్ మసీదులో ఇఫ్తార్ విందు

మండలంలోని మునిపంపుల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి ఒకరోజు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ పాత్రలలో పాలనా దక్షతలను చాటి అబ్బురపరిచారు.విద్యాశాఖ మంత్రి గాదె హర్షవర్ధన్, ఎంపీ గా కమ్మంపాటి రామ్ నితిన్, కలెక్టరుగా వేముల పల్లవి,ఎమ్మెల్సీ గా రాంచరణ్ రాజు,ఎమ్మెల్యే గా గాదె హర్షవర్ధన్,ఆర్డిఓ గా ప్రమోద్ కుమార్,ఎమ్మార్వో గా రాజేశ్, హెచ్ఎం గా సీతు,ఏఏపిసి చైర్మెన్ గా గాదె నిహారిక,ఆర్జెడి గా సమరసింహా రెడ్డి,డిఇఓ గా ఆవుల సిరి, ఎంఈఓ గా శ్రీవాణి,సర్పంచ్ గా లోకేష్, జడ్పిటిసి గా నిష్వంత్, ఎంపీటీసీ గా శ్రీకాంత్,ఉప సర్పంచ్ గా లోకేశ్ లు చక్కగా తమ పాత్రలను పోషించారు. ప్రధానోపాధ్యాయురాలు భానుమతి తమ పాఠశాల సమస్యలను ప్రజా ప్రతినిధులతో చర్చించారు. అనంతరం జనగణమనతో ముగించారు.మధ్యాహ్నం ఒకరోజు ఉపాధ్యాయులకు రెగ్యులర్ టీచర్లు వడ్డించగా సహపంక్తి భోజనం చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులు తమ అనుభవాలను,టీచర్లు విద్యార్ధుల విద్యాభివృద్ధికై, తమకై వారు చేసే కృషిని అందరితో పంచుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొడ్డి స్వామి మాట్లాడుతూ ఈ దేశం భవిష్యత్తు నిర్మించడంలో నేటి విద్యార్థులయిన మీరు రేపటి పౌరులుగా జన్మ భూమికి మంచి పేరు తీసుకురావాలని,నేడు పోషించిన పాత్రలను నిజ జీవితంలో నెరవేర్చుకొనుటకు కృషి చేయాలని హితబోధ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందజేశారుఎంఈ కార్యక్రమంలో పాఠశాల ఏఏపీ సి చైర్మెన్ బత్తిని వెంకటమ్మ,ఉపాధ్యాయులు తిరుమల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వసంత, మనోహర్, మంజుల, త్రివేణి ప్రసాద్, రేవతి, మంజుల, సరోజ, పాల్వంచ హరికిషన్, శ్రీశైలం, సునిత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.