Breaking News

పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందిఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నల్లా అండాలు వైస్ చైర్మన్ గా ఇరెంటి సాయి కృష్ణ, ప్రమాణ స్వీకారం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:

పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మామిడాల యశస్నారెడ్డి అన్నారు. బుధవారం జనగామ జిల్లా కొడకండ్ల మండలలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ చైర్మన్ గా నల్ల అండాలు శ్రీరాములు, వైస్ చైర్మన్ గా ఈ రెంటి సాయి కృష్ణ తోపాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలు పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు హాజరై నూతనంగా కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులoదరికి శుభాకాంక్షలు తెలిపారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్ట పడేవారికి తగిన గుర్తిపు ఉంటుంది అన్నారు. కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు, రైతులతో సమన్వయంతో ముందుకు సాగి వారి సమస్యలు పరిష్కరించి, రైతుల ఆర్థిక అభివృద్ధికి పాటుపడలని అన్నారు. మార్కెట్లో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించి, దళారుల వ్యవస్థ లేకుండా చేయాలని, రైతును రాజుగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుబంధు ప్రభుత్వం గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిచిందన్నారు. కొడకండ్ల వ్యవసాయ కమిటీని ఆదర్శవంతంగా తీర్చిదితున్నానని తెలిపారు,

బీఆర్ఎస్ విధ్వస పాలనా నుండి రాష్ట్రo ఇప్పుడుప్పుడే వికాసం వైపు పయనిస్తుధని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, రైతులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.