Breaking News

ప్రజా వ్యతిరేక బడ్జెట్ తో సామాన్యులకు ఒరిగేది శూన్యం

  • మన ప్రగతి న్యూస్ తొర్రూరు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ తో సామాన్యులకు ఒరిగేది శూన్యమని బిజెపి పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ అన్నారు.

శుక్రవారం డివిజన్ కేంద్రంలో ఆయన మాట్లాడారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్పితే ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. వ్యవసాయ రంగానికి నామ మాత్రపు కేటాయింపులు తప్పితే పెద్దగా ఒరిగేందేమి లేదన్నారు. ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ల పంపిణి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ అంశాల ఉసేలేదన్నారు. తెలంగాణలో మెజారిటీ ప్రజలుగా ఉన్న బిసి సంక్షేమానికి కేవలం రూ.9200 కోట్లు కేటాయించడం శోచనీయమన్నారు. ప్రధాన మంత్రి పసల్ భీమా యోజన లో చేరడాన్ని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకంగా చెప్పుకోవడం సమంజసం కాదన్నారు. అంకురసంస్థలతో పాటు పారిశ్రామిక రంగానికి మొండిచేయి చూపిన బట్టి విక్రమార్క బడ్జెట్ ఇదేనన్నారు.
ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.