Breaking News

సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేత

_ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు..

మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

రాజన్న సిరిసిల్ల: ముస్తాబాద్ మండలం లో సిద్దిపేట నుండి కామారెడ్డి రూట్ లో వెళ్లే బస్సులను ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ మోడల్ స్కూల్ వద్ద రిక్వెస్ట్ స్టాప్ పెట్టి బస్సు ఆపాలని సిద్దిపేట బస్సు డిపో మేనేజర్ కు కాంగ్రెస్ విద్యార్థి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు తెలుపుతూ ముస్తాబాద్ పరిసర గ్రామాల విద్యార్థులు చాలా మంది ముస్తాబాద్ మెడల్ స్కూల్ లో చదువుతున్నారు.విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాఠశాలకు వస్తూ ఉంటారు వారికి బస్ సౌకర్యం ఇబ్బంది గా ఉన్నది కావున మెడల్ స్కూల్ వద్ద బస్సు స్టాప్ రిక్వెస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులందరూ ఆ యొక్క బస్సులో ఎక్కి తమ గమ్యాన్ని చేరుకుంటారు అని తెలిపారు ఈ విషయం డిపో మేనేజర్ కు తెలుపగా స్థానికులంగా స్పందించి త్వరలో బస్సు రిక్వెస్ట్ స్టాపు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం లోఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడిదొడ్డి భాను కుమార్, టీం కె. కె పోతారం నవీన్ గౌడ్, పోతారం వంశీ గౌడ్, కొట్టురి నవీన్ తదితరులు పాల్గొన్నారు..