తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన దళివిద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి
మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి
మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ కి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలని దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ క్రింద వివిధ కేటగిరిలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారందరిని ఆదుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య షారద కి హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము .సర్వ శిక్ష అభియాన్ క్రింద పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరిని మరియు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచింగ్ ,నాన్ టీచింగ్ సిబ్బందిని ఆదుకోవాలని విన్నవించడం జరిగింది. పార్లమెంట్లో మరియు రాష్ట్ర శాసనసభలో ఇట్టి విషయాన్ని పరిశీలించి సమస్య పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులు అందరికీ న్యాయం చేయాలని వేడుకుంటున్నాము .ఈ కార్యక్రమంలో జన్ను రాజయ్య, వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు పులి రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
