మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి:
మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గాడి పెళ్లి రఘు కు25 వేలు, తేజ కావ్య కి 12 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లక్ష్మి పురం గ్రామ పార్టీ అధ్యక్షులు ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమని పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు కొనసాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ ఆశీర్వదించాలని అన్నారు. సీఎం సహాయనిది పొందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబంధనలు సరళతరం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో లాలు నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పి చంద్రయ్య, బి వెంకన్న, టి పరమేష్, సీనియర్ నాయకులు ఎం మల్లయ్య, జి యాకన్న, బి సంజీవ, బి పెద్ద బిక్షం, యూత్ సభ్యులు బి కళ్యాణ్, పి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
