మన ప్రగతి న్యూస్/ నడికూడ:
తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పై జరుగుతున్నా అరాచకాలను, అణిచివేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుండి లగచర్ల రైతన్నలను కాపాడాలని..పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం ..భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నడికూడ మండల కేంద్రంలో నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లగచర్ల రైతులపై అక్రమం గా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిదర్శనమని…రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తి వేసి,వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు,మాజీ ప్రజాప్రతి నిధులు, వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, యూత్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
