మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పశు వైద్యాధికారినిగా డాక్టర్ నిఖిల ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.గత కొంత కాలంగా మండల పశువైద్య శాలలో డాక్టర్ రజిత ఇన్చార్జి వైద్యాధికారిణిగా పనిచేసి ఇటీవలే తమస్థానానికి వెళ్లిపోవడంతో ఖాళీగా ఉన్న వైద్యాధికారి స్థానంలో డాక్టర్ నిఖిల నియమితులయ్యారు.
