Breaking News

కొండపోచమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం.ఈఓ రవికుమార్

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని కొండపోచమ్మ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని దేవాలయం ఈవో రవికుమార్ సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకూండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ ఈఓ రవికుమార్ తెలిపారు. గజ్వేల్ – ప్రజ్ఞాపూర్, జనగామ,సిద్దిపేట బస్సు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారన్నారు. అది, సోమ, మంగళ వారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశం ఉందన్నారు.
జాతర ఏర్పాట్లపై గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని అలాగే జిల్లా కలెక్టర్ మను చౌదరి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జాతరకు భక్తులు భారీగా హాజరైన అవకాశం ఉన్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
దేవాలయం వద్ద గ్రామపంచాయతీ సిబ్బంది అధికారులు మరియు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ సిబ్బంది తో ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోయినచో వాళ్ల తల్లిదండ్రులకు చేర్చే విధంగా తగు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు అన్ని శాఖల అధికారులతో జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు.
ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు జగదేపూర్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ తెలిపారు.

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..