మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని గుడుంబా స్థావరాలు పై ఎక్సైజ్ అధికారులు అర్బన్ టాస్క్ ఫోర్స్ అది పోలీసులు కలిసి నాటు సారా అమ్మకాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని మూడు విజయ బోళ్ల సమ్మక్క గొర్ర సాంబ లక్ష్మి లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వం నిషేధించిన నాటు సారు తయారుచేసిన విక్రయించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు అనంతరం తాసిల్దార్ ముప్పుకృష్ణ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ నాటు సారా తిరిగి అమ్మితే జైలు శిక్ష విధిస్తామని అన్నారు. ఈ దాడులలో నర్సంపేట ఎక్స్చేంజ్ అధికారి నరేష్ రెడ్డి, వరంగల్ అర్బన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రమాదేవి, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
