Breaking News

పాము కాటుతో చిన్నారి మృతి

చిట్యాల. ఫిబ్రవరి 25
( మన ప్రగతి న్యూస్ )

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటుతో ఓ చిన్నారి మృతి చెందింది. కిన్నెర శిరీష – రాజు దంపతులు వీరికి ఒక కుమారుడు, కుమార్తె కిన్నెర కీర్తన(7) ఉన్నారు. కాగా, కుటుంబ సమేతంగా ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి నిద్రిస్తుండగా పాము కాటుకు గురైంది.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఈ క్రమంలో గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన అర్ధరాత్రి చిట్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్ళారు. వైద్యుల సూచనల మేరకు పట్టణంలోని ఎంజిఎం దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ కండ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.