చలి వేంద్రమును ప్రారంభించిన ఎంపీడీవో డి చంద్రశేఖర్
మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్
కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ బస్ షెల్టర్ వద్ద కల్లూరు గ్రామపంచాయతీ ఈవో నందిశెట్టి నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రమును గురువారం ఎంపీడీవో బి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు ప్రయాణికులకు వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా దాహాని తీర్చాలని చలివేంద్రమును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.
