Breaking News

విద్యుత్ ఘాతానికి గురై పాడి గేదె మృతి

మన ప్రగతి న్యూస్/ చిట్యాల

విద్యుదాఘాతానికి గురై పాడి గేదే మృతి చెందిన సంఘటన మండలంలోని చల్లగరిగ గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం చల్లగరిగ గ్రామంలోని ఇంచర్ల లక్ష్మికి చెందిన పాడి గేదె మేత కోసం గురువారం ఉదయం గ్రామ శివారులోని సామల శ్రీహరి చేను వైపు వెళుతున్న తరుణంలో అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు గల ఎర్త్ వైరుకు తాకింది. ఈ క్రమంలో ఎర్త్ వైర్ కు విద్యుత్ సరఫరా కావడంతో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన గేదెకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితురాలు కోరారు

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి