మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజు నాగార్జునసాగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నందు వైద్య శిబిరం నిర్వహించినట్లుగా బ్రాంచ్ మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్ బ్రాంచ్ పరిధిలో ఉన్న సమ భావన మహిళ సంఘాల లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల రుణాలను మంజూరు చేసినట్లుగా తెలిపారు. దీంతోపాటు నాగార్జునసాగర్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఆధ్వర్యంలో బ్యాంకుకు వచ్చిన మహిళాసంఘాల ఖాతాదారులకు శిబిరం ద్వార వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ రాము నాయక్, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ సూపర్వైజర్ కమలమ్మ, ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.