Breaking News

జిల్లా తెలంగాణ భవన్లో మహమ్మద్ జహంగీర్ కి ఘనంగా సన్మానం..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని బిఆర్ఎస్ తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న బుధవారం నాడు ముస్తాబాద్ కేంద్రానికి చెందిన మహమ్మద్ జహంగీర్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ భవన్ లో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు, కేటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగని మనోహర్, కేటీఆర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్. తిరుపతి నాయక్, ప్రభు నాయక్. తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం