Breaking News

మంత్రి పొంగులేటి సెల్ఫ్ షి”కారు”

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం టౌన్ :

మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో షి “కారు “చేశారు. పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతనంగా కొనుగోలు చేసిన ఫార్చునర్ కారును ఆదివారం ఉదయం పొంగులేటి ఆవిష్కరించారు. అనంతరం ఆ కారును స్టార్ట్ చేసిన మంత్రి సరదాగా నడుపుతూ ఎన్టీఆర్ సర్కిల్ వరకు వచ్చారు. పొంగులేటిని అనుసరిస్తూ ఆయన కాన్వాయ్ వెనకనే వచ్చింది. కారు దిగాక పాయంకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరు. అక్కడినుంచి తన కాన్వయలో ఇల్లందు పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం