సీఐ ఆర్ సంతోష్
మన ప్రగతి న్యూస్/ఆత్మకూరు:
పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరాన్ని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని సిఐ ఆర్ సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28వ తేదీన మంగళవారం నాడు 18 సంవత్సరాలు నిండిన యువకులు అందరూ ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని యువకులను కోరారు. మీ రక్తదానం మరొకరికి ప్రాణదానం అని అన్నారు.డిపిఆర్ గార్డెన్ భూపాల్ పల్లి రోడ్డు పరకాల లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

