Breaking News

రక్తదానంలో పాల్గొన్న బీసీ నాయకులు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పోలీసు వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ మరియు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కు అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది ఈ యొక్క రక్తం రక్తహీనత తో బాధపడుతున్న వారికి మరియు రక్తం కొనుక్కోలేని పొజిషన్లో ఉన్న వారికి ఎమర్జెన్సీ రక్తం అవసరం ఉన్నవారికి ఉపయోగపడాలని పోలీసు వారు చేస్తున్న కృషి ఎంతగానో ఆకట్టుకుంది దానిలో భాగంగానే మేము ముందుకు వచ్చి ఈ యొక్క రక్తదానానికి ప్రోత్సహించడం జరిగింది

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం-