Breaking News

నెల్లుట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.

మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం.

లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైకు లారీ ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన సంజయ్ గా గుర్తించారు. తీవ్ర గాయాలైన యువకుడు లింగాల గణపురం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన బూడిద ప్రసాద్ గుర్తించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా ఉందని గతంలో కూడా ఎంతోమంది చనిపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇక పూర్తి సమాచారం తెలియ రాలేదు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..