మన ప్రగతి న్యూస్/ విశాఖపట్నం
మల్కాపురం ఏకేసీ కాలనీలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం పర్యటించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు డ్రైన్లో చేరిన పూడికలు తొలగింపు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ప్రస్తుతం తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలో మిగతా సమస్యలకు కూడా పరిష్కారం చూపుతామని వెల్లడించారు.

