Breaking News

మొంథా తుఫాన్ కారణంగా జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలి

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

భువనగిరి పట్టణ కేంద్రంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా మాట్లాడుతూ తుఫాన్ వర్షం కారణంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.వృత్తిపరంగా వార్త సేకరణలో భాగంగా బైక్ లపై,కార్ల ప్రయాణం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.అనుకోకుండా ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు.జర్నలిస్టులు తుఫాన్ తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించి వార్తలు అందించే విధంగా ఉండాలని కోరారు. విధి నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు జరిగితే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు .