Breaking News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మన ప్రగతి న్యూస్ /హనుమకొండ జిల్లా ప్రతినిధి

పడవ పల్టీ కొట్టి యువకుడు గల్లంతు..

దామెర మండలం ఊరుగొండ నుంచి పసరగొండ గ్రామానికి వెళ్ళే ప్రధాన మార్గం లోని లో లెవల్ వంతెన తో పాటు ఊరుగొండ పెద్ద చెరువు ను పరకాల ఆర్డీవో డాక్టర్ కె.నారాయణ స్థానిక తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి తో కలిసి పరిశీలించారు.ఆర్డీవో మాట్లాడుతూ వర్షం తగ్గినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి శాఖ అధికారి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.అనంతరం తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి ఒగ్లాపూర్ లోని సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పులే , మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు.