Breaking News

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన యొక్క జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు

నేటి యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
—ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు చిన్నగల్ల నరేందర్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 21వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు చిన్నగల్ల నరేందర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని,నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు.అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు.నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు.ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు.ఈకార్యక్రమలో కొండమడుగు ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడిగల్ల బాబు,మాజీ సర్పంచ్ శివగళ్ళ ఇస్తారీ,ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు చిన్నగల్ల అశోక్,దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్,ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగస్వామి,దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు మంద శ్రీశైలం,చిన్నగల్ల లక్ష్మీనారాయణ,బొడ్డు భాస్కర్,ఎరుపుల ప్రేమ రాజ్,శివగళ్ళ రాజు,ముల్గారం భరత్ తదిపరులు పాల్గొన్నారు.