Breaking News

ఆయనకు ఆయనే సాటి..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన సధువాల చంద్రమోహన్- సుమలత దంపతుల కుమార్తె సధువాల పూజిత ఇటీవలే విడుదలైన నీట్ పరీక్ష ఫలితాలలో ఎంబిబిఎస్ సీటు సాధించింది. పేద కుటుంబానికి చెందిన పూజిత అపన్న హస్తం కోసం ఎదురు చూస్తు న్నారు. ఈ తరుణంలో అదే గ్రామా నికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య క్షులు పరమండ్ల మహేందర్ నడికూ డ మండల మాజీ తహాసిల్దార్ గుండాల నాగరాజు దృష్టికి తీసు కొని వెళ్లగా.. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. వారి చేతుల మీదుగా రూ.లు. 42 వేలు ఆర్ధిక సహాయాన్ని అందించి, శాలు వాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరింత సహాయం చేస్తానని పూర్తి భరోసా కల్పించారు. ఈ సందర్భం గా గుండాల నాగరాజు మాట్లాడు తూ.. మునుముందు ఇంకా పై చదువులు చదువుకొని తల్లి దండ్రులకు పేరు తెస్తూ.. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం పొంది, నిరుపేదలకు వైద్య, ఆర్ధిక పరంగా సహాయం అందించాలని విద్యార్థిని ని ఆశీర్వదించారు. ఆయనకు ఆయనే సాటి, ఎవరూ లేరు పోటీ అని నడికూడ మండల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ తహాసిల్దార్ వెంట నడికూడ మండ ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్, తదితరులున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి