చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం..
మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:
దమ్మపేట పోలీసు స్టేషన్ పరిధిలో నేడు సోమవారం ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు.. చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ నాకాబంది కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఈ నాకాబంది నందు దమ్మపేట ఎస్ఐ కిషోర్ రెడ్డి మరియు అదనపు ఎస్ఐ లు స్వామి, రాఘవయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు. మందలపల్లి క్రాస్ రోడ్, అచ్యుతాపురం క్రాస్ రోడ్ వద్ద అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. దమ్మపేట మండల ప్రజలకు ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించిన.. రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజలందరూ కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేయవలసిందిగా కోరారు.

