Breaking News

దమ్మపేట పోలీసులు నిర్వహించిన నాకాబంది

చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబంది నిర్వహించడం జరిగింది. ఈ నాకాబంది కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఈ నాకాబంది నందు దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మరియు అదనపు ఎస్సైలు బాలస్వామి, రాఘవయ్య మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. మందలపల్లి క్రాస్ రోడ్ లో, అచ్యుతాపురం క్రాస్ రోడ్ వద్ద అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ దమ్మపేట మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజలందరూ కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేయవలసిందిగా దమ్మపేట పోలీస్ వారి తరఫున కోరుచున్నామని తెలిపారు.